VIDEO: వాడపల్లి వెంకన్నకు రూ. 53.86 లక్షలు ఆదాయం

VIDEO: వాడపల్లి వెంకన్నకు రూ. 53.86 లక్షలు ఆదాయం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి శనివారం రూ.53.86 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధర్ రావు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.