వారి త్యాగం మరువలేనిది: మంత్రి బీసీ జనార్దన్
AP: ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీని మంత్రి బీసీ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇంతమంది నిర్వాసితులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. సొంతిళ్లు, స్వగ్రామాలను ఖాళీ చేసిన ప్రజల త్యాగం మరువలేనిదన్నారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.