నేడు గుండ్లసముద్రంలో కలెక్టర్ పల్లె నిద్ర
ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజబాబు నేడు పల్లె నిద్రకు మర్రిపూడి మండలం గుండ్లసముద్రం వస్తున్నట్లు తహశీల్దార్ జనార్ధన్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో జిల్లా స్థాయి అధికారులు పల్లె నిద్రకు వస్తున్నారన్నారు. జువ్విగుంట విద్యుత్ శాఖ ఎస్.ఈ, అంకెపల్లి డ్వామా పీడీ, మర్రిపూడి డీఆర్డీఏ పీడీ, అధికారులు వస్తున్నట్లు తెలిపారు.