జర్నలిస్టులకు రేపు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

జర్నలిస్టులకు రేపు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని షాదీ మహల్‌లో ఈనెల 9న అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి రక్త పరీక్షలు, ఈసీజీతో పాటు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ వంటి నిపుణులు సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.