మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ELR: మండవల్లి మండలం లోకుమూడి గ్రామంలో మండల ప్రాధమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని బుధవారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. పిల్లలు తింటున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసారు. ప్రతి రోజు పెడుతున్న భోజనం మెను, భోజనం రుచి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.