చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధి కోసం విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందికొట్కూరు వాస్తవ్యులు తరుణ్ తులసి కుటుంబ సభ్యులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఆలయ అభివృద్ధి కోసం రూ. 30 వేలు విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.