పుతిన్తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా: మోదీ
భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ను స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రేపు మధ్యాహ్నం పుతిన్తో జరగబోయే సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భారత్- రష్యాల స్నేహ బంధం మన ప్రజలకు ఎంతో మేలు చేసిందని ట్వీట్ చేశారు. ఈ మేరకు పుతిన్తో కలిసి కారులో వెళ్లిన ఫొటోను షేర్ చేశారు.