పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన పద్మా దేవేందర్ రెడ్డి

MDK: ఎల్కతుర్తిలో నిన్న జరిగిన BRS రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్య కర్తలు, ప్రజలకు మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మున్ముందు ముందుకు సాగుతూ అధికారంలోకి వచ్చేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆమె కోరారు.