తిరుమల సమాచారం
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,322 మంది భక్తులు దర్శించుకోగా, 26 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.