పేపర్ మిల్లులో ప్రమాదం.. ఒకరు మృతి

SKLM: నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం మిల్లులో ఒక్కసారిగా కొన్ని టన్నుల ఊక తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కార్మికుడు ఉంగటి వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల కాలంలో కొన్ని ప్రమాదాలు మిల్లులో జరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు.