వక్స్ బోర్డ్ సవరణలను వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీ

BPT: వేటపాలెం మండలం రామానగర్ మసీదు వద్ద నుండి ముస్లిం మైనారిటీ సోదరుల వక్ఫ్ బోర్డ్ సవరణలను వ్యతిరేకిస్తూ శాంతియుత వాతావరణంలో ర్యాలీ కొనసాగింది. వేటపాలెం సెంటర్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాలినడకన తహసీల్దార్ కార్యాలయం చేరుకొని డిప్యూటీ ఎమ్మార్వో శ్రీకాంత్కు వినతి పత్రం అందజేశారు.