రాజన్న ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మంగళవారం ఉదయం పరిశీలించారు. కాగా, రూ.150 కోట్ల అంచనా వ్యయంతో సాగుతున్న పనుల్లో భాగంగా ఆలయం దక్షిణవైపు ప్రాకారం విస్తరణ పనులు భారీ యంత్రాల సహాయంతో చేపడుతున్నారు.