'ఎస్. సరస్వతి' వివాదం.. స్పందించిన వరలక్ష్మి
'ఎస్. సరస్వతి' కథా వివాదంపై వరలక్ష్మి శరత్కుమార్ స్పందించింది. ఈ మూవీ కథను రేప్ చేశారని రచయిత సాయి మాధవ్ బుర్రా ఆరోపణలను ఖండించింది. 'నేను కథను దొంగిలించలేదు. సరైన పద్ధతిలో డబ్బు చెల్లించి కొనుగోలు చేశాను. ఆరేళ్లుగా ఆయన వద్దే ఉన్న బేసిక్ ప్లాట్ను తీసుకుని, నేటి అభిరుచికి తగ్గట్లు స్క్రీన్ప్లే మార్చాను. రచయితగా ఆయనకు పూర్తి క్రెడిట్ ఇచ్చాను' అని పేర్కొంది.