పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: రాజుపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని సోమవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు.