VIDEO: ఏపీకి మరో తుఫాన్ ముప్పు
VSP: మొంథా తుఫాన్ తర్వాత, ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాన్ భయం ఆవరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడి, 24న వాయుగుండంగా బలపడి, ఆపై 'సెన్యార్' తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 26 నుంచి 29వ తేదీ వరకు రాయలసీమలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.