కొత్త జిల్లాగా మదనపల్లె

కొత్త జిల్లాగా మదనపల్లె

అన్నమయ్య: మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిలో భాగంగా మదనపల్లెను జిల్లాగా ఆమోదించింది. ప్రస్తుతం ఇది అన్నమయ్య జిల్లాలో ఉండగా, మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.