ఆత్మకూరు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా

ఆత్మకూరు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా

NLR: ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట CPM, CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణ రెండవ వార్డు వెంకట్రావు పల్లిలో గిరిజనులకు శ్మశాన వాటిక, గృహ నిర్మాణం సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. CPM పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, CITU అధ్యక్షుడు నాగయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.