మూడు రోజులు భారీ వర్షాలు: సీపీ

SDPT: సిద్దిపేట జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజర్లు, సభ్యులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలుంటే పోలీసులకు సంప్రదించాలన్నారు.