రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: కలెక్టర్
KMR: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన రవీందర్ నిన్న సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను అభినందించి, జిల్లాలో విద్యుత్ సరఫరా, నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉంటూ, రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు.