VIDEO: మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్దిని
కోనసీమ: మామిడికుదురు మండలం లూటుకుర్రు ZPHSకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పొలనూరి సాయి ప్రకృతి నేషనల్ మీన్స్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఎంఈవో వెంకన్న బాబు మాట్లాడుతూ.. ఆమెకి ఏటా రూ.12 వేలు చొప్పున నాలుగేళ్లకు రూ. 48 వేలు ప్రోత్సాహ నగదు అందుతుందని తెలిపారు. శుక్రవారం విద్యార్థినిని సర్పంచ్ తాతకాపు సత్కరించారు.