ఎల్లమ్మకు రూ.లక్ష విలువగల వెండి ప్రమిదలు బహుకరణ
NLG: కనగల్లు మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి రూ.1,01,040/- విలువ గల రెండు వెండి ప్రమిదలను ఆలయ మాజీ ఉత్సవ కమిటీ ఛైర్మన్ చెనగోని నగేష్ గౌడ్ శుక్రవారం కంచనపల్లి రేణుక ఎల్లమ్మ వైన్స్ గ్రూప్ తరపున ఆలయ అధికారులకు అందజేశారు. ఎల్లమ్మకు మొక్కు చెల్లించుకోవటం తనకు సంతోషంగా ఉందని నగేష్ గౌడ్ తెలిపారు.