నలుగురు విద్యుత్ ఆపరేటర్ల తొలగింపు
NDL: రుద్రవరం మండలం విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు AE రాజశేఖర్ నిన్న తెలిపారు. ఎల్లావత్తుల సబ్ స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం నుంచి ఆంజనేయులు అనే ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు.