జన గణన శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్
CTR: జన గణన -2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్సీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు.