సత్యవేడులో పేట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా.?
TPT: సత్యవేడు మండలంలో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. మదనంజేరి గ్రామంలో సర్వేనంబర్ 186/3 లో 5-00 ఎకరాల మేత బీడు భూముల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.