నేలకొరిగిన 5,444 ఎకరాల పంట
ELR: మొంథా తుపాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలోని యర్రమిల్లిపాడు, నల్లమాడు, రామచంద్రపురం గ్రామంలో పడిపోయిన వరి, అరటి తోటలను గురువారం ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 5444 ఎకరాల పంట నేలకొరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రంగు మారిన ధాన్యాన్ని కొనాలని, తేమ శాతం 17 లోపు ఉండాలన్నారు.