విధులకు రాకున్న ఖాతాలో జీతాలు
MDK: చేగుంట మండలంలోని మక్కరాజ్ పేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు నెలల తరబడి పాఠశాలలకు రాకున్నా.. అధికారులతో కుమ్మక్కై పూర్తి జీతాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించాలని హైదరాబాద్ ఆర్జేడీ, మెదక్ డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.