ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

W.G: పెనుమంట్ర మండలం మాముడూరులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ బొక్క దుర్గాప్రసాద్‌ (27) మృతి చెందారు. సత్తెమ్మ తల్లి ఆలయ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద మట్టి పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్‌ను రివర్స్‌ తీస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు.