విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 2.10 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి శనివారం వివిధ సేవల ద్వారా రూ. 2,10,530 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 294 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 2,400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.