నదిలో జారి బాలిక మృతి

నదిలో జారి బాలిక మృతి

NDL: కుందూ నదిలో కాలు జారి పదేళ్ల బాలిక మృతి చెందింది. ఆదివారం నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాలకు చెందిన షేక్ సుభాన్ బాషా కుటుంబంతో బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు ఆనకట్టకు వెళ్లారు. అక్కడ షేక్ షబానా నీటిలో పడటంతో వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.