జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదు

జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదు

HYD: ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని నటుడు ధర్మ మహేష్ కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో A1గా గౌతమి, A2గా మూర్తిని చేరుస్తూ FIR బుక్ చేశారు. వారు కూడా మహేష్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.