యార్డ్‌ గెస్ట్‌హౌస్‌‌ను పరిశీలించిన ఛైర్‌పర్సన్

యార్డ్‌ గెస్ట్‌హౌస్‌‌ను పరిశీలించిన ఛైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారుల కోసం నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి డైరెక్టర్లతో కలిసి బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పునరుద్ధరించినట్లు ఆమె తెలిపారు. త్వరలో దీనిని ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతుల సౌకర్యార్థం మరిన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.