విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1.44 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1.44 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,44,113 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. 11 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా.. 152 మంది భక్తులు ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.