నేటి నుంచి అగ్రి డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్

TG: వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి 23 వరకు రాజేంద్రనగర్ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా BSC(అగ్రికల్చరల్), BTech(ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా 15% అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.pjtau.edu.inను సంప్రదించాలి.