ఇంటింటి సర్వేలో పాల్గొన్న విద్యార్థులు

ఇంటింటి సర్వేలో పాల్గొన్న విద్యార్థులు

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆదివారం మండలంలో మర్రిచెట్టు తండా గ్రామంలో NSS ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ.. "ప్రతి ఇంటి వివరమే, జాతి భవితకు ఆధారం" అని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.