'మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించండి'

NDL: గణేష్ ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను, గణేష్ కమిటీ సభ్యులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మట్టి విగ్రహాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.