సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కడప: మైదుకూరు నియోజవకవర్గానికి చెందిన దాదాపు 29బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.50,99,522 చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం, ఖాజీపేట, దువ్వూరు, చాపాడు, మైదుకూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.