భార్యతో మనస్పర్దాలు.. వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో షేక్ రహీం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో మనస్పర్దాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.