ఏలూరు జిల్లాలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
ELR: జిల్లా వ్యాప్తంగా పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రధాన దేవాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పలుచోట్ల పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఉగాది పచ్చడి పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ శోభ వెల్లివిరిసింది.