' జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి'
VZM: రాజాం GMR IT కాలేజీలో APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక MLA కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం TDP కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు. 2,600 పోస్టులను భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, టెన్త్ ఇంటర్, డిగ్రీ పీజీ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు.