చిల్కానగర్ డివిజన్లో రూ.7.09 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
MDCL: చిల్కానగర్ డివిజన్లో రూ.7.09 కోట్లతో అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారిపై రూ.6 కోట్లతో 1000MM ట్రంక్ లైన్, వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ఐదేళ్లలో డివిజన్కు రూ.115 కోట్లతో అభివృద్ధి చేశామని, మిగిలిన పనులూ పూర్తి చేస్తామని కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ తెలిపారు.