హంస కాకతీయ అపార్ట్మెంట్లో చోరీ
WGLలోని హంస కాకతీయ అపార్ట్మెంట్లో ఖాళీ ప్లాట్ను దుండగులు లక్ష్యంగా చేసుకుని చోరీ చేశారు. యజమాని ఇంద్రనీల్ చటర్జీ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో నిన్న అర్ధరాత్రి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇవాళ తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు చూడగా.. రూ.1.30 లక్షల విలువైన రెండు ల్యాప్టాప్లు, మూడు వాచీలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు.