గ్రానైట్ లారీ బోల్తా.. ముగ్గురు కూలీల మృతి

AP: బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలకల కిందపడి నలిగిపోయి ముగ్గురు మృతి చెందారు. మార్టూరు నుంచి చిలకలూరిపేట, పర్చూరు మీదుగా గుంటూరు వెళ్తుండగా తిమ్మరాజుపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో పలకలను తొలగించారు.