జిల్లా రగ్బీ జట్టుకు అభినందనలు
SKLM: కర్నూలులో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల రగ్బీ ఛాంపియన్షిప్లో జిల్లా జట్టు సత్తా చాటి తృతీయ స్థానం కైవసం చేసుకుంది. కోచ్ కే. సీతయ్య అద్భుత మార్గదర్శనంలో క్రీడాకారులు రాణించి, కాంస్య పతకాన్ని సాధించారు. విజేతలకు ట్రోఫీ, సర్టిఫికెట్లు, మెడల్స్ను అందజేసి జిల్లా రగ్బీ అసోసియేషన్ నేతలు బుధవారం ఘనంగా అభినందించారు.