అడవి పందుల దాడిలో ధ్వంసమైన గోధుమ పంట
ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామంలో అడవి పందుల దాడిలో ధ్వంసమైన గోధుమ పంటను వ్యవసాయ అధికారులు, నాయకులు పరిశీలించారు. ఆ గ్రామానికి చెందిన రాథోడ్ లత రెండు ఎకరాల పొలంలో వేసిన గోధుమ పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో ఆ పంటను గురువారం ఏఈఓ రాజేశ్వర్ రాథోడ్, FBO పద్మజ, BRS పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబార్ టైగర్ పరిశీలించారు.