కొత్తబయన్నపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

కొత్తబయన్నపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

సత్యసాయి: గోరంట్ల మండలం పూలేరు పంచాయతీ పరిధిలోని కొత్తబయన్నపల్లి గ్రామంలో NREGS పథకం కింద రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు గురువారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోరంట్ల టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.