నగరపాలక కార్యాలయంలో నేడు 'పీజీఆర్ఎస్'

నగరపాలక కార్యాలయంలో నేడు 'పీజీఆర్ఎస్'

చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. బాధిత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.