పోగొట్టుకున్న మొబైల్ ప్రయాణికుడికి అందజేత
NLG: నల్గొండ నుంచి భువనగిరికి వెళ్తున్న బస్సులో ప్రయాణించిన వ్యక్తి నార్కట్ పల్లిలో దిగాడు. హైదరాబాద్కు మరో బస్సులో వెళ్లేందుకు అక్కడ దిగిన ఆయన ఫోన్ పోగొట్టుకున్నట్లు గుర్తించి, నార్కట్పల్లి కంట్రోలర్కు సమాచారం అందించాడు. వెంటనే చిట్యాల కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథకు సమాచారం అందించగా... బస్సులో మొబైల్ని వెతికి తీసుకొని ప్రయాణికుడికి అందించాడు.