పాలిసెట్‌లో సత్తా చాటిన కర్నూలు విద్యార్థులు

పాలిసెట్‌లో సత్తా చాటిన కర్నూలు విద్యార్థులు

KRNL: సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసిన పాలిసెట్-2025 ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 6,435 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 4,395 మంది బాలురు, 2,040 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 93.65% గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 95.98% గా నమోదైంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 94.39%గా ఉంది.