ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే
VZM: హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వారి అధినాయకుని నిర్ణయాన్ని ఎత్తిచూపినందుకు మీడియాపై వైసీపీ దాడి చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆంధ్రజ్యోతికథనంపై అభ్యంతరం ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప, ఇలా భౌతిక దాడులు సరికాదన్నారు.