ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ కోరింపు
KNR: కోడుమూరు నుంచి రాజోలికి గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా సేవలు లేకపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని వారు తెలిపారు. బస్సు పునరుద్ధరణ కోసం పలుమార్లు అధికారులను కోరినా స్పందన లభించలేదని వాపోయారు. వెంటనే బస్సు సేవలు పునఃప్రారంభించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.